శ్రీలంక పై భారత్ ఘన విజయం...
- September 03, 2017
కొలంబో: ఐదో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విధించిన 239 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది, ఐదు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 46.3 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16, రహానే 5, పాండే 36, జాదవ్ 63 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ ఒక పరుగు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ వీర విజృంభణ చేసి 5 వికెట్లు నేల కూల్చాడు. బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ నేల కూల్చారు. లంక బ్యాట్స్మెన్లలో కెప్టెన్ ఉపుల్ తరంగ (48), లహిరు తరిమన్నె (67), మాథ్యూస్ (55) ఆకట్టుకున్నారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







