శ్రీలంక పై భారత్ ఘన విజయం...
- September 03, 2017
కొలంబో: ఐదో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విధించిన 239 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది, ఐదు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 46.3 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16, రహానే 5, పాండే 36, జాదవ్ 63 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ ఒక పరుగు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ వీర విజృంభణ చేసి 5 వికెట్లు నేల కూల్చాడు. బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ నేల కూల్చారు. లంక బ్యాట్స్మెన్లలో కెప్టెన్ ఉపుల్ తరంగ (48), లహిరు తరిమన్నె (67), మాథ్యూస్ (55) ఆకట్టుకున్నారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









