శ్రీలంక పై భారత్ ఘన విజయం...
- September 03, 2017
కొలంబో: ఐదో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక విధించిన 239 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది, ఐదు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 46.3 బంతుల్లో భారత్ 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 16, రహానే 5, పాండే 36, జాదవ్ 63 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ ఒక పరుగు చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 238 పరుగులకు ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ వీర విజృంభణ చేసి 5 వికెట్లు నేల కూల్చాడు. బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ నేల కూల్చారు. లంక బ్యాట్స్మెన్లలో కెప్టెన్ ఉపుల్ తరంగ (48), లహిరు తరిమన్నె (67), మాథ్యూస్ (55) ఆకట్టుకున్నారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









