'ఛేజ్ మాస్టర్' బిరుదు అందుకున్న కోహ్లీ

- September 07, 2017 , by Maagulf
'ఛేజ్ మాస్టర్' బిరుదు అందుకున్న కోహ్లీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి తాజాగా ఓ బిరుదు ఇచ్చింది. 'ఛేజ్ మాస్టర్' అంటూ కొనియాడింది. బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.. అని ఐసీసీ పేర్కొంది.
నిజానికి కోహ్లీకి ఛేజింగ్ అంటేనే ఇష్టం. లక్ష్య ఛేదనలో ముందుండే కోహ్లీ తాజాగా శ్రీలంకతో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ ఇదే ఫార్ములాను ఎంచుకున్నాడు. ప్రత్యర్థులకు బ్యాటింగ్ అప్పగించి, అనంతరం వారు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ దిట్ట అనిపించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సాధించిన పరుగుల్లో ఎక్కువ శాతం ఛేదనలో వచ్చినవే. ఇక టీ20లలో కోహ్లీ ఏకంగా ఛేజింగ్‌లో 1,016 పరుగులు పిండుకోవడం విశేషం. ఇక ఇప్పటికే కోహ్లీని అభిమానులు చీకూ అని, ఇండియన్ రన్ మిషన్ అని, పరుగుల వీరుడని పిలిచుకుంటుంటారు.. ఇప్పుడు ఛేజ్ మాస్టర్ బిరుదు కూడా వచ్చి చేరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com