'ఛేజ్ మాస్టర్' బిరుదు అందుకున్న కోహ్లీ
- September 07, 2017
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి తాజాగా ఓ బిరుదు ఇచ్చింది. 'ఛేజ్ మాస్టర్' అంటూ కొనియాడింది. బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్తో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.. అని ఐసీసీ పేర్కొంది.
నిజానికి కోహ్లీకి ఛేజింగ్ అంటేనే ఇష్టం. లక్ష్య ఛేదనలో ముందుండే కోహ్లీ తాజాగా శ్రీలంకతో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ ఇదే ఫార్ములాను ఎంచుకున్నాడు. ప్రత్యర్థులకు బ్యాటింగ్ అప్పగించి, అనంతరం వారు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ దిట్ట అనిపించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగుల్లో ఎక్కువ శాతం ఛేదనలో వచ్చినవే. ఇక టీ20లలో కోహ్లీ ఏకంగా ఛేజింగ్లో 1,016 పరుగులు పిండుకోవడం విశేషం. ఇక ఇప్పటికే కోహ్లీని అభిమానులు చీకూ అని, ఇండియన్ రన్ మిషన్ అని, పరుగుల వీరుడని పిలిచుకుంటుంటారు.. ఇప్పుడు ఛేజ్ మాస్టర్ బిరుదు కూడా వచ్చి చేరింది.
తాజా వార్తలు
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!









