సోషల్ మీడియా లో ఫొటోస్ పెడుతున్నారా? అయితే కాస్త ఆలోచించండి
- September 10, 2017
లగ్జరీ కారుతో ఎంచక్కా ఇన్స్టాగ్రామ్లోనో, కాస్ట్లీ వాచ్తో ఫేస్బుక్లోనే కనిపిస్తే ఇక పన్ను అధికారులు తలుపు తట్టే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి నల్లధనం వెలికితీతకు పన్ను అధికారులు సోషల్ మీడియానూ జల్లెడ పట్టనున్నారు. ఆదాయ వెల్లడి, ఖర్చు పెట్టే తీరు మధ్య వ్యత్యాసాలను పసిగట్టేందుకు సోషల్ మీడియా సైట్ల నుంచి సమాచారాన్ని విశ్లేషించేందుకు పన్ను అధికారులు ‘ప్రాజెక్ట్ ఇన్సైట్’ను చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఇన్సైట్ అమలు కోసం ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ఎల్అండ్టీ ఇన్ఫోటెక్తో ఒప్పందం చేసుకుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలను గుర్తించి బ్లాక్ మనీ పంపిణీకి చెక్ పెట్టడంలో ఈ ప్రాజెక్టు పన్ను అధికారులకు సహకరిస్తుంది. నోట్ల రద్దు అనంతరం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పన్ను ఎగవేతలు, బ్లాక్మనీని గుర్తించేందుకు వర్చువల్ సమాచారాన్నివినియోగించుకుంటామని పన్ను అధికారులు తెలిపారు.వ్యక్తి ఆదాయం, ఆస్తులను పూర్తిస్ధాయిలో పరిశీలించేందుకు పాన్, ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం అనివార్యం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







