సోషల్ మీడియా లో ఫొటోస్ పెడుతున్నారా? అయితే కాస్త ఆలోచించండి

- September 10, 2017 , by Maagulf
సోషల్ మీడియా లో ఫొటోస్ పెడుతున్నారా? అయితే కాస్త ఆలోచించండి

లగ్జరీ కారుతో ఎంచక్కా ఇన్‌స్టాగ్రామ్‌లోనో, కాస్ట్‌లీ వాచ్‌తో ఫేస్‌బుక్‌లోనే కనిపిస్తే ఇక పన్ను అధికారులు తలుపు తట్టే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి నల్లధనం వెలికితీతకు పన్ను అధికారులు సోషల్‌ మీడియానూ జల్లెడ పట్టనున్నారు. ఆదాయ వెల్లడి, ఖర్చు పెట్టే తీరు మధ్య వ్యత్యాసాలను పసిగట్టేందుకు సోషల్‌ మీడియా సైట్ల నుంచి సమాచారాన్ని విశ్లేషించేందుకు పన్ను అధికారులు ‘ప్రాజెక్ట్‌ ఇన్‌సైట్‌’ను చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ ఇన్‌సైట్‌ అమలు కోసం ఆదాయ పన్ను విభాగం ఇప్పటికే ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. అధిక విలువ కలిగిన లావాదేవీలను గుర్తించి బ్లాక్‌ మనీ పంపిణీకి చెక్‌ పెట్టడంలో ఈ ప్రాజెక్టు పన్ను అధికారులకు సహకరిస్తుంది. నోట్ల రద్దు అనంతరం చేపట్టిన ఆపరేషన్‌ క్లీన్‌ మనీలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పన్ను ఎగవేతలు, బ్లాక్‌మనీని గుర్తించేందుకు వర్చువల్‌ సమాచారాన్నివినియోగించుకుంటామని పన్ను అధికారులు తెలిపారు.వ్యక్తి ఆదాయం, ఆస్తులను పూర్తిస్ధాయిలో పరిశీలించేందుకు పాన్‌, ఆధార్‌ అనుసంధానాన్ని ప్రభుత్వం అనివార్యం చేసిన విషయం విదితమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com