దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం

- October 29, 2015 , by Maagulf
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం

 

:విజయవాడలోని సీఎం కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "నేనిక్కడ.. మీరక్కడ ఉంటే.. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని సచివాలయ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగులు హైదరాబాద్‌లో.. ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటే ప్రభుత్వ పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడతారని చంద్రబాబు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లోపు సచివాలయ ఉద్యోగులు ఆమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఉద్యోగులు అడిగినవన్నీ ఇచ్చానని, నవ్యాంధ్ర నిర్మాణానికి త్యాగాలు తప్పవని ఆయన అన్నారు. ఉద్యోగులకు రెండు చోట్ల హెచ్ఆర్ఏ ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదని ఉద్యోగులకు చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులందరికీ విజయవాడలో తాత్కాలిక బస ఏర్పాటుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com