దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం
- October 29, 2015
:విజయవాడలోని సీఎం కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ "నేనిక్కడ.. మీరక్కడ ఉంటే.. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా జరగడం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని సచివాలయ ఉద్యోగులతో సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగులు హైదరాబాద్లో.. ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటే ప్రభుత్వ పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడతారని చంద్రబాబు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్లోపు సచివాలయ ఉద్యోగులు ఆమరావతికి రావాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఉద్యోగులు అడిగినవన్నీ ఇచ్చానని, నవ్యాంధ్ర నిర్మాణానికి త్యాగాలు తప్పవని ఆయన అన్నారు. ఉద్యోగులకు రెండు చోట్ల హెచ్ఆర్ఏ ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదని ఉద్యోగులకు చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులందరికీ విజయవాడలో తాత్కాలిక బస ఏర్పాటుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







