దుబాయ్‌ రాఫిల్: 1 మిలియన్‌ డాలర్లు గెల్చుకున్న ఇండియన్‌ డ్రైవర్‌

- September 12, 2017 , by Maagulf
దుబాయ్‌ రాఫిల్: 1 మిలియన్‌ డాలర్లు గెల్చుకున్న ఇండియన్‌ డ్రైవర్‌

దుబాయ్‌:భారతదేశానికి చెందిన వేలు వేణుగోపాల్‌, దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్‌ ప్రమోషన్‌ సందర్భంగా 1 మిలియన్‌ డాలర్లను రఫాలెలో గెల్చుకున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అతనికి బహుమతి లభించినా, డ్రైవర్‌గా తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాడాయన. 'నేను పెద్ద మొత్తంలో సొమ్ముని బహుమతిగా పొంది ఉండొచ్చు. కానీ నా పని నేను చేసుకుపోవాలి కదా' అని వేలు వేణుగోపాలన్‌ చెప్పారు. కేరళకు చెందిన వ్యక్తి ఈయన. వేణుగోపాల్‌ ఈ బహుమతి గెల్చుకున్న 121వ వ్యక్తి. మొత్తం 252 రఫాలె డ్రాస్‌ ఇప్పటిదాకా జరిగాయి. చాలా ఏళ్ళుగా తాను రపాలె టిక్కెట్స్‌ కొనుగోలు చేస్తున్నాననీ, ఈ సారి తనను అదృష్టం వరించిందని చెప్పారు. 1987లో వేణుగోపాల్‌, యూఏఈకి వెళ్ళారు. 30 ఏళ్ళ తర్వాత వేణుగోపాల్‌ తిరిగి తన స్వదేశానికి వెళ్ళి, గెలిచిన సొమ్ముతో వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని అనుకుంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com