ఇస్లాంని కించపర్చిన వ్యక్తికి జైలు

- September 12, 2017 , by Maagulf
ఇస్లాంని కించపర్చిన వ్యక్తికి జైలు

దుబాయ్‌​:సోషల్‌ మీడియాలో ఇస్లాంని కించపర్చుతూ సందేశాలు పోస్ట్‌ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. భారతదేశానికి చెందిన 31 ఏళ్ళ కార్మికుడు, ప్రొఫెట్‌ మొహమ్మద్‌ని కించపర్చేలా ఫేస్‌బుక్‌ సందేశాలు పోస్ట్‌ చేయడం జరిగింది. ఆ పోస్ట్‌ని ఆ తర్వాత సదరు వ్యక్తి తొలగించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాధారాలతో నిందితుడ్ని అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించారు. తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తూ, తన అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని పేర్కొన్నాడు. అయితే న్యాయస్థానం నిందితుడి అప్పీల్‌ని తిరస్కరించింది. అయితే మరోమారు న్యాయస్థానంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం నిందితుడికి లభించింది. ప్రస్తుతం నిందితుడిపై 500,000 దిర్హామ్‌ల జరీమానా, ఏడాది జైలు, జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్‌ శిక్షల్ని విధించింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com