ఇస్లాంని కించపర్చిన వ్యక్తికి జైలు
- September 12, 2017
దుబాయ్:సోషల్ మీడియాలో ఇస్లాంని కించపర్చుతూ సందేశాలు పోస్ట్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. భారతదేశానికి చెందిన 31 ఏళ్ళ కార్మికుడు, ప్రొఫెట్ మొహమ్మద్ని కించపర్చేలా ఫేస్బుక్ సందేశాలు పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ని ఆ తర్వాత సదరు వ్యక్తి తొలగించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సాక్ష్యాధారాలతో నిందితుడ్ని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. తనపై వచ్చిన అభియోగాల్ని నిందితుడు ఖండిస్తూ, తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని పేర్కొన్నాడు. అయితే న్యాయస్థానం నిందితుడి అప్పీల్ని తిరస్కరించింది. అయితే మరోమారు న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం నిందితుడికి లభించింది. ప్రస్తుతం నిందితుడిపై 500,000 దిర్హామ్ల జరీమానా, ఏడాది జైలు, జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ శిక్షల్ని విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







