ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్‌కి శంకుస్థాపన

- September 14, 2017 , by Maagulf
ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ ట్రైన్‌కి శంకుస్థాపన

ఎట్టకేలకు ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ రైలు కోసం గురువారం ప్రధాని నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని షిజోఅబేలు శంకుస్థాపన చేశారు. రిమోట్‌ ద్వారా వీరిద్దరూ పనులకు శ్రీకారంచుట్టారు. వచ్చే ఏడాది నుంచి నిర్మాణం మొదలుపెట్టి 2022 నాటికి ఫినిష్ చేయాలన్నది మోదీ ఆలోచన. 508 కిలోమీటర్ల మేరా ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.  ఈ ప్రాజెక్టుకు 1.10 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా! 468 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ మార్గం కాగా, 27 కిలోమీటర్ల మేరా భూగర్భ టన్నెల్.. సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల నిర్మాణం జరగనుంది. సింపుల్‌గా కొంతభాగం సముద్రగర్భంలో నుంచి రైలు వెళ్లనుంది. ఇక గంటలకు 350 కిలోమీటర్ల వేగంగా పరుగులు పెట్టనుంది.
ఈ ప్రాజెక్టుకు 1.10 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా! ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, రోడ్డు, విమాన, రైలు, జల రవాణా ద్వారా దేశం మొత్తం అనుసంధానం అవుతుందన్నారు. అమెరికాలో కూడా రైల్వే వ్యవస్థ వచ్చాకే అభివృద్ధి చెందిందన్నారు. 1964లోనే జపాన్‌లో బుల్లెట్ ట్రైన్ మొదలైందని, హైస్పీడ్ రవాణా వ్యవస్థ ద్వారా ఆర్థిక ప్రగతికి మార్గం సుగమం అవుతుందన్నారు మోదీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com