కతార్ లోని భారతీయ రాయబార కార్యాలయం లో 240 మరణాలు, 3,432 ఫిర్యాదుల నమోదు

- October 29, 2015 , by Maagulf
కతార్ లోని భారతీయ రాయబార కార్యాలయం లో 240 మరణాలు, 3,432 ఫిర్యాదుల నమోదు

భారతీయ రాయబార కార్యాలయం, తమ శ్రామిక మరియు సాంఘిక సంక్షేమ విభాగం వారి గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 3432 ఫిర్యాదులు, మరణాలు 240 నమోదు కాగా; కార్యాలయంలో నమోదైన మరణాలు 27 అని; గత సంవత్సరంలో ఈ సంఖ్య 279 అని 'ఓపెన్ హౌస్' కార్యక్రమంలో భారత రాయబారి - శ్రీ సంజీవ్ అరోరా, డేప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ -అర్.కె. సింగ్ తెలిపారు. కార్యాలయ అధికారులు సెంట్రల్ జైలును, బహిష్కృత కేంద్రాన్ని తరచూ సందర్శించి, అక్కడి భారతీయ ఖైదీల బాగోగులు చూస్తూనే ఉంటారని ఆయన తెలిపారు. బహిష్కృత కేంద్రo లో ఉన్న భారత జాతీయులనుండి కతార్ అధికారులకు అందిన  విజ్ఞప్తుల మేరకు, ఈ నెలలో రాయబార కార్యాలయం 19 ఎమర్జెన్సీ సర్టిఫికేట్ లను,  26 విమాన్ ప్రయాణ టికెట్లను జారీ చేసింది.కార్యాలయం సహాయసహకారాలతో భారతీయ శ్రామికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థ 'భారతీయ సాంఘిక సానుభూతి వేదిక' అధ్యక్షులు - ఆరవింద్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com