కతార్ లోని భారతీయ రాయబార కార్యాలయం లో 240 మరణాలు, 3,432 ఫిర్యాదుల నమోదు
- October 29, 2015
భారతీయ రాయబార కార్యాలయం, తమ శ్రామిక మరియు సాంఘిక సంక్షేమ విభాగం వారి గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 3432 ఫిర్యాదులు, మరణాలు 240 నమోదు కాగా; కార్యాలయంలో నమోదైన మరణాలు 27 అని; గత సంవత్సరంలో ఈ సంఖ్య 279 అని 'ఓపెన్ హౌస్' కార్యక్రమంలో భారత రాయబారి - శ్రీ సంజీవ్ అరోరా, డేప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ -అర్.కె. సింగ్ తెలిపారు. కార్యాలయ అధికారులు సెంట్రల్ జైలును, బహిష్కృత కేంద్రాన్ని తరచూ సందర్శించి, అక్కడి భారతీయ ఖైదీల బాగోగులు చూస్తూనే ఉంటారని ఆయన తెలిపారు. బహిష్కృత కేంద్రo లో ఉన్న భారత జాతీయులనుండి కతార్ అధికారులకు అందిన విజ్ఞప్తుల మేరకు, ఈ నెలలో రాయబార కార్యాలయం 19 ఎమర్జెన్సీ సర్టిఫికేట్ లను, 26 విమాన్ ప్రయాణ టికెట్లను జారీ చేసింది.కార్యాలయం సహాయసహకారాలతో భారతీయ శ్రామికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థ 'భారతీయ సాంఘిక సానుభూతి వేదిక' అధ్యక్షులు - ఆరవింద్ పటేల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







