మధ్యప్రాచ్యంలో ఆపిల్ మొట్టమొదటి ఔట్లెట్ యూ. ఎ.ఈ. లో ప్రారంభం
- October 29, 2015
ప్రపంచంలోనే మార్కెట్ విలువ పరంగా అతి పెద్దదైన, అమెరికాకు చెందిన నంబర్ 1 సాంకేతిక సంస్థ - ఆపిల్, మధ్యప్రాచ్యంలో తమ మొదటి రెండు స్టోర్లను ఈ గురువారం, దుబాయి మరియు అబుధాబీలలో కిక్కిరిసిన సందర్శకుల మధ్య ప్రారంభించింది. గత సంవత్సరం 63 శాతం అభివృద్ధిని నమోదు చేసి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి దూసుకుపోతోంది. ఈ కార్యక్రమానికి హాజరవడానికి మస్కట్ నుండి 400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన ఒమాని మహ్మూద్ జావేద్ వంటి అనేక మంది ఖాతాదారులు మాల్ ఆఫ్ ద ఎమిరేట్స్ యొక్క రెండవ అంతస్టులోని ఈ కొత్త స్టోర్ బయట అనేకమంది పడిగాపులు కాసారు. తొమ్మిది మిలియన్ల విదేశీయులతో సహా, పది మిలియన్ల జనాభా గల ఈ దేశం, నిజమైన అంతర్జాతీయ వాణిజ్య మరియు పర్యాటక స్థలంగా మారిందని, ఇక్కడ ఇప్పటి వరకు ఆపిల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, వారి స్వంత ఔట్ లేట్ ఇదే ప్రధమమని, వారు ప్రపంచమంతటా విజయం సాధించినట్టే ఇక్కడ కూడా విజయం సాధిస్తారని జావేద్ ఆకాంక్షించారు. ఇక అబుధాబీ రాజధాని లోని ఫార్ములా 1 సర్క్యూట్ లోని ఎస్ ఐలండ్ లో కూడా ఒక స్టోర్ ప్రారంభమయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







