సెప్టెంబర్ 30వ తేదీన లండన్ కు చంద్రబాబు మరియు రాజమౌళి
- September 15, 2017
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని లండన్ తీసుకువెళ్లేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారుల బృందం సెప్టెంబర్ 30వ తేదీన రాజమౌళిని లండన్ తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న పలు ముఖ్యమైన కట్టడాల డిజైన్స్ కోసం లండన్లోని ఫేమస్ ఆర్కిటెక్ట్స్ నార్మన్ ఫోస్టర్ సహాయం తీసుకుంటున్నారు. తాజాగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ అయిన అనంతరం పలు కార్యాలయాల నిర్మాణంలో మరిన్ని హంగులు, అత్యాధునిక డిజైన్స్ అవసరం అని భావించిన సీఎం చంద్రబాబు.. ఈ నెలాఖరున రాజమౌళిని లండన్కి వెంట తీసుకెళ్లి అక్కడ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేయించాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. గతంలోనూ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రాజమౌళి పలుసార్లు సీఆర్డీఏ అధికారులతో భేటీ సలహాలు, సూచనలు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







