ఐసిస్ నరమేధం ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు 74 మంది మృతి

- September 15, 2017 , by Maagulf
ఐసిస్ నరమేధం ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు 74 మంది మృతి

గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మరోసారి పంజా విసిరింది. ఇరాక్‌లోని దిఖర్ ప్రావిన్స్‌ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంట్‌పై దాడికి పాల్పడి 74 మందిని పొట్టనబెట్టుకుంది. సాయుధులైన కొందరు ఉగ్రవాదులు రెస్టారెంట్‌లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి..అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు..ఈ మారణకాండలో 74 మంది పౌరులు మరణించగా..మరో 91 మంది గాయపడ్డారు..సమాచారం అందుకున్న భద్రతా దళాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఇస్లాంకు వ్యతిరేకంగా నడుస్తున్న ఇరాక్‌ తన చర్యలను ఆపకపోతే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com