ఐసిస్ నరమేధం ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు 74 మంది మృతి
- September 15, 2017
గత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మరోసారి పంజా విసిరింది. ఇరాక్లోని దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంట్పై దాడికి పాల్పడి 74 మందిని పొట్టనబెట్టుకుంది. సాయుధులైన కొందరు ఉగ్రవాదులు రెస్టారెంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి..అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న చెక్పోస్ట్పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు..ఈ మారణకాండలో 74 మంది పౌరులు మరణించగా..మరో 91 మంది గాయపడ్డారు..సమాచారం అందుకున్న భద్రతా దళాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఇస్లాంకు వ్యతిరేకంగా నడుస్తున్న ఇరాక్ తన చర్యలను ఆపకపోతే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







