మజ్నులో నాగచైతన్య, వెంకటేష్ మరియు నాగ్
- October 29, 2015
టాలీవుడ్ స్క్రీన్ మీద మల్టీ స్టారర్ సినిమాల హవా కొనసాగుతోంది. కథాపరంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించే స్థాయి కథలు రాకపోయినా గెస్ట్ అపియరెన్స్ లతో అదరగొడుతున్నారు స్టార్స్. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హీరోలతో కలిసి నటించడానికి సీనియర్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే బ్రూస్ లీ సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చేయటంతో మరో ఫ్యామిలీ నుంచి కూడా ఇలాంటి కాంబినేషన్ తెర మీద సందడి చేయనుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న నాగచైతన్య, ఆ సినిమా పూర్తవ్వగానే మళయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్ రీమేక్ లో నటించనున్నాడు. తెలుగులో మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకున్న చిత్రయూనిట్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తుంది. చైతూ సరసన మళయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో కీలక సన్నివేశాల్లో కనిపించే ఓ ఇంపార్టెంట్ రోల్ ను సీనియర్ హీరో వెంకటేష్ తో చేయించాలని భావిస్తున్నారు. వెంకీతో పాటు మరో అతిథి పాత్రలో నాగ్ కూడా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. నాగచైతన్యకు ఈ రెండు కుటుంబాల నేపథ్యం ఉండటంతో మజ్ను సినిమాలో నాగ్, వెంకీలు నటించటం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి గాసిప్ గా ఉన్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







