రోహింగ్యా శరణార్థులకు అండగా ఉంటాం: సుష్మా
- September 15, 2017రోహింగ్యా శరణార్థుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రోహింగ్యా వలసల విషయంపై ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. శరణార్థులను వెనక్కి పిలిపించాల్సిందిగా మయన్మార్పై ఒత్తిడి తీసుకొస్తామని సుష్మా చెప్పినట్లు హసీనా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 25 నుంచి బంగ్లాదేశ్కు దాదాపు 3లక్షల మందికి పైగా రోహింగ్యాలు వలసలుగా వచ్చారు. ఇప్పటికే ఆ దేశంలో మూడు లక్షల మంది శరణార్థులు నివసిస్తున్నారు.
'మయన్మార్ నుంచి వస్తున్న శరణార్థుల వివాదంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుష్మా స్వరాజ్ మా ప్రధానమంత్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. రోహింగ్యాలు బంగ్లా రాకుండా మయన్మార్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి వారిని వెనక్కి పిలిచేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకొస్తాం' అని సుష్మా చెప్పినట్లు హసీనా డిప్యూటీ ప్రెస్ కార్యదర్శి నజ్రుల్ ఇస్లామ్ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే బంగ్లాలో ఉన్న రోహింగ్యాల కోసం భారత్ 53టన్నుల సహాయ సామాగ్రినిపంపించింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్