రోహింగ్యా శరణార్థులకు అండగా ఉంటాం: సుష్మా
- September 15, 2017
రోహింగ్యా శరణార్థుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రోహింగ్యా వలసల విషయంపై ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సుష్మాస్వరాజ్ ఫోన్లో మాట్లాడారు. శరణార్థులను వెనక్కి పిలిపించాల్సిందిగా మయన్మార్పై ఒత్తిడి తీసుకొస్తామని సుష్మా చెప్పినట్లు హసీనా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 25 నుంచి బంగ్లాదేశ్కు దాదాపు 3లక్షల మందికి పైగా రోహింగ్యాలు వలసలుగా వచ్చారు. ఇప్పటికే ఆ దేశంలో మూడు లక్షల మంది శరణార్థులు నివసిస్తున్నారు.
'మయన్మార్ నుంచి వస్తున్న శరణార్థుల వివాదంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుష్మా స్వరాజ్ మా ప్రధానమంత్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. రోహింగ్యాలు బంగ్లా రాకుండా మయన్మార్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి వారిని వెనక్కి పిలిచేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకొస్తాం' అని సుష్మా చెప్పినట్లు హసీనా డిప్యూటీ ప్రెస్ కార్యదర్శి నజ్రుల్ ఇస్లామ్ మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే బంగ్లాలో ఉన్న రోహింగ్యాల కోసం భారత్ 53టన్నుల సహాయ సామాగ్రినిపంపించింది.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









