బనియాస్ బ్రిడ్జ్పై ఆ బస్సుల నిషేధం
- September 16, 2017
బనియాస్ బ్రిడ్స్పై నుంచి కార్మికుల బస్సులు ప్రయాణించడాన్ని నిషేధిస్తున్నట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి బనియాస్ బ్రిడ్జిపై కార్మికుల్ని తరలించే బస్సులపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ బ్రిడ్జిపై ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కల్నల్ సలీమ్ అబ్దుల్లా బిన్ బారక్ అల్ ధధెరి చెప్పారు. బనియా బ్రిడ్జిపై కార్మికుల బస్సులను బ్యాన్ చేసిన నేపథ్యంలో కార్మికుల్ని తరలించే బస్సుల్ని నడిపే డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘించి కార్మికుల్ని తరలించే బస్సుల్ని బనియా బ్రిడ్జిపైకి తీసుకొస్తే, 1000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







