బనియాస్ బ్రిడ్జ్పై ఆ బస్సుల నిషేధం
- September 16, 2017
బనియాస్ బ్రిడ్స్పై నుంచి కార్మికుల బస్సులు ప్రయాణించడాన్ని నిషేధిస్తున్నట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి బనియాస్ బ్రిడ్జిపై కార్మికుల్ని తరలించే బస్సులపై నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ బ్రిడ్జిపై ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కల్నల్ సలీమ్ అబ్దుల్లా బిన్ బారక్ అల్ ధధెరి చెప్పారు. బనియా బ్రిడ్జిపై కార్మికుల బస్సులను బ్యాన్ చేసిన నేపథ్యంలో కార్మికుల్ని తరలించే బస్సుల్ని నడిపే డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఉపయోగించాలని ఆయన సూచించారు. ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘించి కార్మికుల్ని తరలించే బస్సుల్ని బనియా బ్రిడ్జిపైకి తీసుకొస్తే, 1000 దిర్హామ్ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన









