36 ఏళ్ళ వయసొచ్చినా ఆమె పరిస్థితి దయనీయం
- September 16, 2017
మనామా: భారతదేశంలో 36 ఏళ్ళుగా విదేశీయురాలిగా జీవిస్తున్న ఓ మహిళ ఎట్టకేలకు బహ్రెయిన్ చేరుకుని, తన జాతీయతపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 1980లో బహ్రెయినీ తండ్రికీ, భారతీయురాలైన మహిళకి సదరు మహిళ జన్మించింది. అయితే ఆ తర్వాత ఆ బహ్రెయినీ తండ్రి, ఆ భారతీయురాలితో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన బిడ్డను తీసుకుని ఆ మహిళ, కొన్ని అనివార్య కారణాలతో బహ్రెయిన్ని విడిచపెట్టాల్సి వచ్చింది. పదేళ్ళలోపు ఆ చిన్నారి తిరిగి బహ్రెయిన్కి చేరుకోవాల్సి ఉన్నా, అందుకు తగిన పత్రాల్ని అందించడంలో ఆ చిన్నారి తండ్రి విఫలమయ్యారు. దాంతో ఆ చిన్నారి ఇటు భారతీయురాలు కాలేక, అటు బహ్రెయినీ పౌరసత్వం పొందలేక అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఎట్టకేలకు ఆమె బహ్రెయిన్లోకి ప్రవేశించి, అక్కడే తన పౌరసత్వం కోసం పోరాటం చేస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









