36 ఏళ్ళ వయసొచ్చినా ఆమె పరిస్థితి దయనీయం
- September 16, 2017
మనామా: భారతదేశంలో 36 ఏళ్ళుగా విదేశీయురాలిగా జీవిస్తున్న ఓ మహిళ ఎట్టకేలకు బహ్రెయిన్ చేరుకుని, తన జాతీయతపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరపాలని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 1980లో బహ్రెయినీ తండ్రికీ, భారతీయురాలైన మహిళకి సదరు మహిళ జన్మించింది. అయితే ఆ తర్వాత ఆ బహ్రెయినీ తండ్రి, ఆ భారతీయురాలితో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన బిడ్డను తీసుకుని ఆ మహిళ, కొన్ని అనివార్య కారణాలతో బహ్రెయిన్ని విడిచపెట్టాల్సి వచ్చింది. పదేళ్ళలోపు ఆ చిన్నారి తిరిగి బహ్రెయిన్కి చేరుకోవాల్సి ఉన్నా, అందుకు తగిన పత్రాల్ని అందించడంలో ఆ చిన్నారి తండ్రి విఫలమయ్యారు. దాంతో ఆ చిన్నారి ఇటు భారతీయురాలు కాలేక, అటు బహ్రెయినీ పౌరసత్వం పొందలేక అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఎట్టకేలకు ఆమె బహ్రెయిన్లోకి ప్రవేశించి, అక్కడే తన పౌరసత్వం కోసం పోరాటం చేస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







