మెగాస్టార్ చిరంజీవే నాకు స్ఫూర్తి
- September 16, 2017
సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం శ్రీవల్లి. ఈ సినిమాలో నటించిన హీరోగా మారాడు రజత్. సినీ పరిశ్రమలో దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడమే నా లక్ష్యమని తెలపాడు రజత్. ఈ సినిమాలో నటించిన రజిత్ శ్రీవల్లి ఎలాంటి అనుభుతినిచ్చిందో తెలిపాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ...సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది. ఇదొక అరుదైన అవకాశంగా భావించాను. విజయేంద్రప్రసాద్గారి సూచనలకు అనుగుణంగా నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నించాను. గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం కావడంతో ఎక్కువ భాగాన్ని బ్లూమ్యాట్లో తెరకెక్కించారు. మన పక్కన లేనవి ఉన్నట్టుగా వాతావరణాన్ని ఊహించుకొని నటించడం ఛాలెంజ్గా అనిపించింది. సినిమాలోని చివరి 20 నిమిషాల్లో వచ్చే క్లెమాక్స్ ఘట్టాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలొస్తున్నాయి. ఈ రంగంలోకి రావడానికి మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి...
ఎందరో వర్థమాన నటుల మాదిరిగానే నేను కూడా చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చాను. నా వృత్తిలో అంకితభావాన్ని ప్రదర్శిస్తూ అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పాత్రల్లోనైనా రాణిస్తాననే నమ్మకముంది. నేటి ట్రెండ్కు అనుగుణంగా యువతరాన్ని మెప్పించే వినూత్న పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో విజయవంతంగా కెరీర్ను కొనసాగిస్తాననే నమ్మకముంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









