ఎస్వీఆర్ గా నటించనున్న మోహన్బాబు
- September 16, 2017
ఎన్ని తరాలు మారినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయే నటులు ఎస్వీ రంగారావు. ఆయన నటన, పోషించిన పాత్రలు నిత్యనూతనం. ఆయన సమకాలీన నటి సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్ర కూడా ఉంటుంది. ఆ పాత్రలో మోహన్బాబు నటించబోతున్నారు. ఎస్వీ రంగారావు పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ... అందులో మోహన్బాబు చేసే సందడి ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేలా ఉంటుందని, అక్టోబరు చివర్లో కానీ, లేదంటే నవంబరు మొదటివారంలో కానీ ఆయన సెట్లోకి అడుగుపెట్టనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, ప్రకాష్రాజ్ తదితరులు ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోందీ చిత్రం. ప్రస్తుతం పాలకొల్లులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్లుక్ని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









