ఫేస్ బుక్ పరిచయం కారణంగా లండన్ లేడి చేతిలో మోసపోయిన ఒక తెలుగు డాక్టర్
- September 18, 2017
ఫేస్ బుక్లో పరిచయాలు, ఆన్లైన్లో మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తికి రెండు నెలల కిందట ఫేస్బుక్లో లండన్కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. వారిమధ్య రోజూ ఛాటింగ్ జరుగుతోంది. లండన్ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ వెంటనే ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్ కరెన్సీ లేదని, తన దగ్గర 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో ఫోన్ చేయించింది. ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె ఖాతాలో జమ చేశారు. డబ్బు అందుకున్న మరుక్షణం నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. ఆమె నుంచి ఎటువంటి సమాచారంలేదు. దీంతో ఆ డాక్టర్కి అప్పటికి గానీ మెలకువ రాలేదు. మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ పటమట ఫోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







