ఫేస్ బుక్ పరిచయం కారణంగా లండన్ లేడి చేతిలో మోసపోయిన ఒక తెలుగు డాక్టర్
- September 18, 2017
ఫేస్ బుక్లో పరిచయాలు, ఆన్లైన్లో మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన డాక్టర్ కృష్ణమూర్తికి రెండు నెలల కిందట ఫేస్బుక్లో లండన్కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. వారిమధ్య రోజూ ఛాటింగ్ జరుగుతోంది. లండన్ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ వెంటనే ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్ కరెన్సీ లేదని, తన దగ్గర 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో ఫోన్ చేయించింది. ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె ఖాతాలో జమ చేశారు. డబ్బు అందుకున్న మరుక్షణం నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. ఆమె నుంచి ఎటువంటి సమాచారంలేదు. దీంతో ఆ డాక్టర్కి అప్పటికి గానీ మెలకువ రాలేదు. మోసపోయినట్లు గ్రహించిన డాక్టర్ పటమట ఫోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









