పార్కింగ్‌ టిక్కెట్‌ ఫోర్జరీ

- September 19, 2017 , by Maagulf
పార్కింగ్‌ టిక్కెట్‌ ఫోర్జరీ

బ్యాంక్‌ క్లీనర్‌పై పార్కింగ్‌ టిక్కెట్‌ ఫోర్జరీ కేసు నమోదు చేశారు. కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ ఈ కేసు విచారణ చేపట్టింది. 30 ఏళ్ళ బంగ్లా దేశీ వ్యక్తి, పార్కింగ్‌ టైమ్‌ని 10.22 నిమిషాల నుంచి 12.22 నిమిషాల వరకు పొడిగించేందుకుగాను ట్యాంపరింగ్‌కి పాల్పడుతున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆగస్ట్‌ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్‌గా ఆ క్లీనర్‌ ద్వారా పార్కింగ్‌ టిక్కెట్‌ని తీసుకోవడం జరుగుతోందనీ, అయితే ఓసారి తన పార్కింగ్‌ టిక్కెట్‌ ట్యాంపరింగ్‌కి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగు చూసిందని తెలిపారు ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి. టైమ్‌ పెంచడం కోసం ట్యాంపరింగ్‌ చేసిన మాట వాస్తవమేనని నిందితుడు విచారణలో అంగీకరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com