పార్కింగ్ టిక్కెట్ ఫోర్జరీ
- September 19, 2017
బ్యాంక్ క్లీనర్పై పార్కింగ్ టిక్కెట్ ఫోర్జరీ కేసు నమోదు చేశారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఈ కేసు విచారణ చేపట్టింది. 30 ఏళ్ళ బంగ్లా దేశీ వ్యక్తి, పార్కింగ్ టైమ్ని 10.22 నిమిషాల నుంచి 12.22 నిమిషాల వరకు పొడిగించేందుకుగాను ట్యాంపరింగ్కి పాల్పడుతున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆగస్ట్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్గా ఆ క్లీనర్ ద్వారా పార్కింగ్ టిక్కెట్ని తీసుకోవడం జరుగుతోందనీ, అయితే ఓసారి తన పార్కింగ్ టిక్కెట్ ట్యాంపరింగ్కి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగు చూసిందని తెలిపారు ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి. టైమ్ పెంచడం కోసం ట్యాంపరింగ్ చేసిన మాట వాస్తవమేనని నిందితుడు విచారణలో అంగీకరించాడు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









