బెల్లం రొట్టె
- September 20, 2017
కావలసిన పదార్థాలు : బెల్లం - 1 కప్పు, బియ్యప్పిండి - అరకప్పు (ఆరుగంటల సేపు నానబెట్టి, నీళ్లుపిండి ఆరబెట్టాలి) , నీళ్లు - 1 కప్పు, ఎండు కొబ్బరికోరు - అరకప్పు, నువ్వు లు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, నూనె - 6 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : నువ్వులు, జీడిపప్పు, కొబ్బరికోరు దోరగా వేగించి ఉంచుకోవాలి. ఒక పాత్రలో బెల్లం, నీళ్లు కలిపి బాగా మరగనిచ్చి, వేగించిన నువ్వులు, కొబ్బరి, జీడిపప్పుతో పాటు బియ్యప్పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసి, మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసి మూతపెట్టి, సన్నని సెగమీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్పూనుతో గుచ్చిచూస్తే పిండి అంటుకోకుండా ఉంటే దించేసి ఒక ప్లేటులో బోర్లించి ఐదు నిమిషాలపాటు ఉంచితే రొట్టె ప్లేటులో పడిపోతుంది. దీన్ని ముక్కలుగా కోసి తినండి. పొరలు పొరలుగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది 3 రోజుల వరకూ నిలవ కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







