బెల్లం రొట్టె
- September 20, 2017
కావలసిన పదార్థాలు : బెల్లం - 1 కప్పు, బియ్యప్పిండి - అరకప్పు (ఆరుగంటల సేపు నానబెట్టి, నీళ్లుపిండి ఆరబెట్టాలి) , నీళ్లు - 1 కప్పు, ఎండు కొబ్బరికోరు - అరకప్పు, నువ్వు లు - 2 టీ స్పూన్లు, జీడిపప్పులు - 10, నూనె - 6 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం : నువ్వులు, జీడిపప్పు, కొబ్బరికోరు దోరగా వేగించి ఉంచుకోవాలి. ఒక పాత్రలో బెల్లం, నీళ్లు కలిపి బాగా మరగనిచ్చి, వేగించిన నువ్వులు, కొబ్బరి, జీడిపప్పుతో పాటు బియ్యప్పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసి, మిశ్రమాన్ని దిబ్బరొట్టెలా వేసి మూతపెట్టి, సన్నని సెగమీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత స్పూనుతో గుచ్చిచూస్తే పిండి అంటుకోకుండా ఉంటే దించేసి ఒక ప్లేటులో బోర్లించి ఐదు నిమిషాలపాటు ఉంచితే రొట్టె ప్లేటులో పడిపోతుంది. దీన్ని ముక్కలుగా కోసి తినండి. పొరలు పొరలుగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇది 3 రోజుల వరకూ నిలవ కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









