కొత్త ఫ్లైఓవర్ తో హైటెక్సిటీలో ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
- September 21, 2017
హైటెక్సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక్కడ మరో ైఫ్లెవోర్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐటీ కారిడార్లో వెలుస్తున్న అంతర్జాతీయ ఐటీ సంస్థలతో ఇక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోంది. దీంతో రోడ్ల సామర్థ్యానికి మించి వాహన రాకపోకలు సాగుతుంటే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ నగరంగా ఖ్యాతిని పొందుతున్న ఐటీ కారిడార్ రోడ్లపై ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మాదాపూర్, హైటెక్సిటీ ప్రాంతాల్లో మెట్రో పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ టవర్స్ నుంచి శిల్పారామం, ఎన్ కన్వెన్షన్ సెంటర్ వరకు సరికొత్తగా ఎలివేటెడ్ రోటరీని నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. సుమారు 90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ నిర్మాణ పనుల కోసం సర్వేలను ప్రారంభించింది. పూర్తయితే సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోతాయి. దీంతో పాటుగా పాదాచారులకు సైతం రోడ్డు దాటేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఐటీ రంగంలో దేశంతో పాటు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక్కడ నూతనంగా చేపడుతున్న అభివృద్ధి పనులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే సైబర్స్ వద్ద నిర్మించనున్న ైఫ్లెఓవర్ నిర్మాణ పనులను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను రూపొందిస్తుంది. ఈ నిర్మాణం చేపట్టే ప్రాంతాల సర్వేతో పాటు ప్రైవేట్ ప్రాపర్టీల తొలగింపు విషయంలోనూ అన్ని చర్యలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







