యూఏఈ తొమ్మిదేళ్ళ రక్తచరిత్రకు ముగింపు

- September 21, 2017 , by Maagulf
యూఏఈ తొమ్మిదేళ్ళ రక్తచరిత్రకు ముగింపు

రెండు కుటుంబాల మధ్య తొమ్మిదేళ్ళుగా నడుస్తున్న రక్తచరిత్రకు ఎట్టకేలకు ముగింపు పడింది. 2008లో అల్‌ అహ్‌బాబి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, అల్‌ బ్లౌషి కుటుంబానికి చెందిన యువకుడ్ని చంపేయడంతో ఈ వివాదం రాజుకుంది. 2012లో బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, వైరి వర్గానికి చెందిన ఇద్దర్ని హతమార్చడంతో ఈ రక్త చరిత్ర ముదిరి పాకాన పడింది. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్యా దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. యూఏఈకి చెందిన ప్రముఖులు ఈ వివాదానికి పరిష్కారం పలికేందుకు ముందుకొచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకూ అంగీకరించారు. ఇకపై తమ మధ్య ఎలాంటి గొడవలు ఉండవని పెద్దల సమక్షంలో వారంతా ప్రతిజ్ఞ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com