యూఏఈ తొమ్మిదేళ్ళ రక్తచరిత్రకు ముగింపు
- September 21, 2017
రెండు కుటుంబాల మధ్య తొమ్మిదేళ్ళుగా నడుస్తున్న రక్తచరిత్రకు ఎట్టకేలకు ముగింపు పడింది. 2008లో అల్ అహ్బాబి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, అల్ బ్లౌషి కుటుంబానికి చెందిన యువకుడ్ని చంపేయడంతో ఈ వివాదం రాజుకుంది. 2012లో బాధిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, వైరి వర్గానికి చెందిన ఇద్దర్ని హతమార్చడంతో ఈ రక్త చరిత్ర ముదిరి పాకాన పడింది. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్యా దాడులు, ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. యూఏఈకి చెందిన ప్రముఖులు ఈ వివాదానికి పరిష్కారం పలికేందుకు ముందుకొచ్చారు. పలు దఫాల చర్చల అనంతరం ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకునేందుకూ అంగీకరించారు. ఇకపై తమ మధ్య ఎలాంటి గొడవలు ఉండవని పెద్దల సమక్షంలో వారంతా ప్రతిజ్ఞ చేశారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







