'తెలంగాణ సంఘం--అబుధాబి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'బతుకమ్మ సంబరాలు'
- September 23, 2017
అబుధాబి: తెలంగాణా సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో యు.ఏ.ఈ లో ఉంటున్నతెలంగానీయులందరు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ బతుకమ్మ సంబరాలను అబుధాబీ నగరంలోని ఇండియా సోషల్సెంటర్ ఆడిటోరియంలో దాదాపు పదిహేను వందల మంది తెలుగువారి సమక్షంలో ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. ఫిదా ఫెమ్ నటి శరణ్య ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమంలో ఆనంద ఉత్సాహాలను తారాస్థాయి కి చేర్చింది. డప్పులతో అబుదాబి తెలుగింటి ఆడబిడ్డలు కార్యస్థలానికి చేరాక, ప్రార్ధనగీతంతో కార్యక్రమము మొదలుపెట్టారు. తర్వాత చిన్నారులు వారి ఆటపాటలతో అందరి నీఅలరించారు. కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచు లందరు ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అమ్మవారిని తలచుకున్నారు. వారి ఉత్సాహం ఇష్క్ ఆడిటోరియంని మరో తెలంగాణాను తలపించింది
ఈప్రక్రియలో, అన్నింటిలోనూ అందమైన బతుకమ్మలకు, బాగా సాంప్రదాయకంగా తయారైన పిల్లలకు మరియు బాగా బతుకమ్మ ఆడిన వారికి కార్యనిర్వాహకులు బహుమతులు ప్రకటించారు.
బతుకమ్మకు పూజ చేసిన అనంతరం, సాంప్రదాయ బద్దంగా బతుకమ్మను నిమజ్జనంచేసి, ప్రసాదవితరణ అనంతరం కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
ఈకార్యక్రమానికి వచ్చిన అందరికి కార్యనిర్వాహకులు రాజ శ్రీనివాస్, వంశీ, పృథ్వి, సదానంద్, గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పావని, రోజా, అర్చన, పద్మజ,గోపాల్,గోపి తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు.
--ప్రదీప్ చవ్వా(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

















తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









