పాదచారులకు దారివ్వండి: మోటరిస్టులకు పోలీసుల సూచన
- September 24, 2017
షార్జా: మోటరిస్టులు, పాదచారులకు దారివ్వాలనీ, నిర్దేశిత ప్రాంతాల్లో పాదచారులు రోడ్డును దాటేందుకు మోటరిస్టులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పాదచారులు రహదారిని దాటే ప్రాంతాల్లో మోటరిస్టులు అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్పారు. అంతర్గత రోడ్లపై వాహనదారులు ఖచ్చితంగా వేగం తగ్గించి తమ వాహనాలు నడపాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సూచించారు. పాదచారులకు అవకాశమివ్వకుండా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలుంటాయనీ, నిబంధనల ప్రకారం 500 దిర్హామ్ల జరీమానా, ఆరు బ్లాక్ పాయింట్స్ ఉల్లంఘనులకు తప్పవని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







