పద్మభూషణ్కు బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు పేరు సిఫారసు
- September 25, 2017
బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగుతేజం పీవీ సింధు పేరును పద్మభూషణ్కు సిఫారసు చేసింది క్రీడల శాఖ. మొన్న ధోనీ పేరును సిఫారసు చేసిన క్రీడల శాఖ తాజాగా.. సింధు పేరును కూడా పరిశీలించాల్సిందిగా సూచించింది. ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు.. ఆ తర్వాత కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. తాజాగా జరిగిన కొరియా ఓపెన్ సిరీస్లో విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే గ్రూప్ 1 అధికారిగా నియమించింది. ఆమె బాధ్యతలు కూడా చేపట్టారు. క్రీడల్లో ప్రతిభ చాటుతున్న సింధును పద్మభూషణ్కు సిఫారసు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







