లండన్లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు
- September 25, 2017
తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్లో బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఇంగ్లండ్లోని ప్రవాస తెలంగాణ వారి కోసం హౌన్స్లాలోని ఇండియన్ జింఖానా గ్రౌండ్స్లో బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 2 వేల మందికి పైగా ప్రవాస తెలంగాణవాసులు హాజరయ్యారు. మహిళలందరూ బతుకమ్మలను సుందరంగా అలంకరించి ఆడిపాడారు. తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని గుర్తు తెచ్చేలా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కోలాటాలతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఇక తెలంగాణ నుంచి తెప్పించిన జమ్మి ఆకును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. వేడుకలకు వచ్చిన వారికి హైదరాబాద్ బిర్యానీ వడ్డించారు. తెలంగాణ నుంచి తమ పిల్లలు, మనుమలతో గడిపేందుకు వచ్చిన పెద్దలు, హాజరైన అతిథులు... బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని తెలిపారు. విదేశీ గడ్డపై బతుకమ్మ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం గొప్పగా ఉందన్నారు.
ఈ వేడుకలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి, ఎమ్మెల్సీ ప్రకాశ్ గౌడ్, గుండవరపు దేవీప్రసాద్, నాగేందర్ గౌడ్, దర్శకులు సురేందర్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక సభ్యులు గంప వేణుగోపాల్, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్గౌడ్, అడ్వైజరీ చైర్మన్ అంతటి ప్రమోద్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ గంగసాని, తిరుపతి గోలి, ముఖ్యకార్యదర్శులు నగేశ్ రెడ్డి కాసర్ల, కోశాధికారులు వెంకట్ రంగు, నరేష్ మరియాల, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి స్వామి ఆశ, స్పాన్సర్ టీ అశోక్ మేడిశెట్టి, భాస్కర్ మొట్ట, రాజేశ్ ఎనపోతుల, మీడియా టీం సాయి ప్రసాద్ మార్గం, శిరీష్ కే చౌదరి, స్వచ్ఛంద మరియు సంక్షేమ టీం మీనాక్షి అంతటి, తెలంగాణ ఎన్నారై ఫోరం మహిళా విభాగం సభ్యులు హేమలత గంగసాని, జయశ్రీ గంప, జ్యోతిరెడ్డి కాసర్ల, కవిత గోలి, కావ్య రెడ్డి, మేఘల ఆకుల, ప్రీతి సీక, ప్రియాంక కర్పూరం, రమాదేవి తిరునగరి, శ్రీలక్ష్మి మర్యాల, సుచరిత కాల్వ, వాణి రంగు, నందిని మొట్ట, భారతి కొప్పుల, రజిత, వాణి రంగు, ఏరియా ఇంచార్జులు.. వెస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ సతీష్ వాసిరెడ్డి, ఈస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ శ్రీధర్ నల్ల, వీరు చౌదరి, రమేశ్ సింగం గౌడ్, శేషు కుమార్ ఆళ్ళ, సతీష్ వాసిరెడ్డి, ఈస్ట్ అండ్ నార్త్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ శ్రీధర్ బాబు మంగళారపు, సంతోష్ కోడిప్యాక పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







