మెమరీ కార్డ్ కోసం సోదరుడ్ని చంపిన వ్యక్తి
- September 25, 2017
24 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి తన సోదరుడ్ని సిజర్తో పొడిచి చంపేసిన ఘటనకు సంబంధించి అజ్మన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టుకి ఈ కేసును రిఫర్ చేసింది. కెమెరాకి సంబంధించిన మెమరీ కార్డ్ విషయమై అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కేవలం 100 దిర్హామ్ల విలువైన మెమరీ కార్డ్ కోసం ఈ హత్య జరగడం ఆందోళన కలిగించే అంశం. గొడవ జరుగుతున్న సమయంలో సోదరుల్ని వారించేందుకు సోదరి తీవ్రంగా ప్రయత్నించినా, గొడవ ముదిరి పాకాన పడ్డం, సోదరులిద్దరూ ఆవేశకావేశాలకు పాల్పడటంతో జరగరాని ఘోరం జరిగిపోయింది. నిందితుడు, సోదరుడితోనూ, సోదరితోనే కాక, తల్లితోనూ మెమరీ కార్డ్ కోసం గొడవపడ్డాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







