చేపల ధరల పెంపుపై 'సోషల్' పోరాటం
- September 25, 2017
మనామా: బహ్రెయినీలకు అత్యంత ప్రీతి పాత్రమైన చేపలు, రొయ్యల ధరలు అమాంతం పెరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు, పోరుబాట కూడా పట్టారు. కొన్నాళ్ళపాటు చేపలు, రొయ్యలను తినడం బహిష్కరించాలనీ, తద్వారా మార్కెట్లో డిమాండ్ తగ్గి, అమ్మకందారులు రేట్లను తగ్గిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 'లెట్ ఇట్ రాట్' అనే స్లోగన్తో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఉద్యమానికి పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. తాజా చేపల ధర కిలో 6 బహ్రెయిన్ దినార్స్ నుంచి 7 బహ్రెయిన్ దినార్స్ వరకు పలుకుతోంది. ఇది సామాన్యులు భరించలేని ధర అనే విమర్శలు వినవస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడం బాధ కలిగిస్తోందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









