చేపల ధరల పెంపుపై 'సోషల్' పోరాటం
- September 25, 2017
మనామా: బహ్రెయినీలకు అత్యంత ప్రీతి పాత్రమైన చేపలు, రొయ్యల ధరలు అమాంతం పెరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు, పోరుబాట కూడా పట్టారు. కొన్నాళ్ళపాటు చేపలు, రొయ్యలను తినడం బహిష్కరించాలనీ, తద్వారా మార్కెట్లో డిమాండ్ తగ్గి, అమ్మకందారులు రేట్లను తగ్గిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 'లెట్ ఇట్ రాట్' అనే స్లోగన్తో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఉద్యమానికి పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. తాజా చేపల ధర కిలో 6 బహ్రెయిన్ దినార్స్ నుంచి 7 బహ్రెయిన్ దినార్స్ వరకు పలుకుతోంది. ఇది సామాన్యులు భరించలేని ధర అనే విమర్శలు వినవస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడం బాధ కలిగిస్తోందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







