చేపల ధరల పెంపుపై 'సోషల్‌' పోరాటం

- September 25, 2017 , by Maagulf
చేపల ధరల పెంపుపై 'సోషల్‌' పోరాటం

మనామా: బహ్రెయినీలకు అత్యంత ప్రీతి పాత్రమైన చేపలు, రొయ్యల ధరలు అమాంతం పెరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా కొందరు, పోరుబాట కూడా పట్టారు. కొన్నాళ్ళపాటు చేపలు, రొయ్యలను తినడం బహిష్కరించాలనీ, తద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గి, అమ్మకందారులు రేట్లను తగ్గిస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 'లెట్‌ ఇట్‌ రాట్‌' అనే స్లోగన్‌తో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ ఉద్యమానికి పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. తాజా చేపల ధర కిలో 6 బహ్రెయిన్‌ దినార్స్‌ నుంచి 7 బహ్రెయిన్‌ దినార్స్‌ వరకు పలుకుతోంది. ఇది సామాన్యులు భరించలేని ధర అనే విమర్శలు వినవస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడం బాధ కలిగిస్తోందని సోషల్‌ మీడియాలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com