చేపల ధరల పెంపుపై 'సోషల్' పోరాటం
- September 25, 2017
మనామా: బహ్రెయినీలకు అత్యంత ప్రీతి పాత్రమైన చేపలు, రొయ్యల ధరలు అమాంతం పెరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు, పోరుబాట కూడా పట్టారు. కొన్నాళ్ళపాటు చేపలు, రొయ్యలను తినడం బహిష్కరించాలనీ, తద్వారా మార్కెట్లో డిమాండ్ తగ్గి, అమ్మకందారులు రేట్లను తగ్గిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 'లెట్ ఇట్ రాట్' అనే స్లోగన్తో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఉద్యమానికి పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. తాజా చేపల ధర కిలో 6 బహ్రెయిన్ దినార్స్ నుంచి 7 బహ్రెయిన్ దినార్స్ వరకు పలుకుతోంది. ఇది సామాన్యులు భరించలేని ధర అనే విమర్శలు వినవస్తున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడం బాధ కలిగిస్తోందని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









