అక్టోబర్ 6న గల్ఫ్లో 'మార్చ్ 22' విడుదల
- September 25, 2017
దుబాయ్: కన్నడలో ఘనవిజయం సాధించిన 'మార్చ్ 22' సినిమా గల్ఫ్లో అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. దుబాయ్, అబుదాబీ, సార్జాలలో ఈ సినిమా విడుదల చేయనున్నారు. అనంత్ నాగ్, రాధికా చేతన్ ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దుబాయ్లో, షార్జా, అబుదాబీల్లో సందడి చేయనున్నారు. సీనియర్ నటుడు అనంత్ నాగ్ 'మార్చ్ 22' సినిమాలో చూపిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన భార్య సీనియర్ నటి గాయత్రి అనంత్ నాగ్, రాధికా చేతన్, తదితరులు ఈ సినిమా తొలి ప్రదర్శనకు హాజరవుతారు. దుబాయ్కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హరీష్ షెరిగార్, ఆయన సతీమణి షర్మిలా షెరిగార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ దర్శకుడు కొడ్లు రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనికంఠ కద్రి - ఎన్జె రవిశంకర్ రాజంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









