రొయ్యల మెంతికూర
- November 01, 2015కావలసిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, నూనె - 1 టేబుల్ స్పూను, ఉల్లి తరుగు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కసూరి మేతీ - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అరకప్పు.
తయారుచేసే విధానం: రొయ్యలను శుభ్రం చేసి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత వేగించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి 3 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. తర్వాత నీరుపోసి చిన్నమంటపై ఉడికించాలి. నీరు ఆవిరయ్యాక మెదిపిన కసూరి మేతీ వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు