రొయ్యల మెంతికూర
- November 01, 2015
కావలసిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, నూనె - 1 టేబుల్ స్పూను, ఉల్లి తరుగు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కసూరి మేతీ - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అరకప్పు.
తయారుచేసే విధానం: రొయ్యలను శుభ్రం చేసి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత వేగించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి 3 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. తర్వాత నీరుపోసి చిన్నమంటపై ఉడికించాలి. నీరు ఆవిరయ్యాక మెదిపిన కసూరి మేతీ వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









