రొయ్యల మెంతికూర
- November 01, 2015
కావలసిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, నూనె - 1 టేబుల్ స్పూను, ఉల్లి తరుగు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కసూరి మేతీ - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అరకప్పు.
తయారుచేసే విధానం: రొయ్యలను శుభ్రం చేసి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత వేగించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి 3 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. తర్వాత నీరుపోసి చిన్నమంటపై ఉడికించాలి. నీరు ఆవిరయ్యాక మెదిపిన కసూరి మేతీ వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







