రొయ్యల మెంతికూర
- November 01, 2015
కావలసిన పదార్థాలు: రొయ్యలు - పావు కిలో, నూనె - 1 టేబుల్ స్పూను, ఉల్లి తరుగు - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, కసూరి మేతీ - 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అరకప్పు.
తయారుచేసే విధానం: రొయ్యలను శుభ్రం చేసి పక్కనుంచాలి. నూనెలో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత వేగించాలి. ఇప్పుడు రొయ్యలు వేసి 3 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు మగ్గించాలి. తర్వాత నీరుపోసి చిన్నమంటపై ఉడికించాలి. నీరు ఆవిరయ్యాక మెదిపిన కసూరి మేతీ వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. దించేముందు కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







