జగన్ సతీమణి కి ఊహించని షాక్
- September 27, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత వై ఎస్ జగన్ కి ఒక దాని పై మరొకటి దెబ్బలు తగులుతున్నాయి …అయితే ఈ సారి ఈ దెబ్బ ఊహించని రూపం లో అదీ ఆయన సతీమణి భారతిరెడ్డి కి తగలింది .
వివరాల్లోకి వెళితే అప్పట్లో విజయవాడ కేంద్రంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే …అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవటం ఈ కాల్ మనీ అనే వ్యవస్థని ఉక్కుపాదం తో తోక్కేయటం జరిగినవి అయితే అప్పట్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న క్రమం లో సాక్షి దినపత్రిక సరయిన సాక్ష్యాలు లేకుండా పలువురి పై అభాండాలు మోపింది అని తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా దుయ్యబట్టారు అయితే కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగానికి అద్యక్షత వహిస్తున్న చలసాని ఆంజనేయులు ఒక అడుగు ముందుకు వేసి సాక్షి పత్రిక పై పరువునష్టం దావా వేసారు ….తనకు ఎటువంటి సంబంధం లేని కాల్ మనీ వ్యవహారం లో తన ప్రమేయం ఉన్నట్లు కధనాలు రాసి తన పరువుకి భంగం కలిగించారు అనేది ప్రధాన అభియోగం …అయితే ఈ కేసులో నూజివీడు కోర్టు సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి విచారణకి హాజరు అవ్వాలి అని ఉత్తర్వులు జారీ చేసినా విచారణ కి హాజరు కాకపోవటం తో కోర్టు ధిక్కారణ కింద వీరిద్దరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది మరి ఈ గండం నుంచి జగన్ సతీమణి ఎలా బయటపడతారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







