పాక్ చిన్నారికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా సాయం
- September 27, 2017
సుష్మాస్వరాజ్.. యావత్ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే ఎన్నోసార్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు ప్రపంచంలో ఏ మూలన భారతీయలు ఉన్నా క్షణాల్లో ఆమె నుంచి సాయం అందుతుంది. అందుకు 'ఉజ్మా' ఘటన వంటి ఉదాహరణలు ఎన్నో.. కేవలం స్వదేశీయులే కాదు.. సాయం కోరి వచ్చిన విదేశీయులకు సైతం ఆపన్న హస్తం అందిస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన.
తమ ఏడేళ్ల చిన్నారికి భారత్లో ఓపెన్హార్ట్ సర్జరీ చేయించేందుకు పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ గత ఆగస్టులో వీసాకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ వీసా జారీ చేయకపోవడంతో ఆమె సుష్వాస్వరాజ్ సాయం కోరింది. తమ చిన్నారికి వీసా మంజూరు చేయాలంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్కు స్పందించిన సుష్మాస్వరాజ్.. ఆ చిన్నారి మెడికల్ వీసాకు అనుమతినిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సుష్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. గతంలోనూ ఆమె ఇదే విధంగా కొందరు పాక్ చిన్నారులు, మహిళలకు మెడికల్ వీసాలు అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







