పాక్‌ చిన్నారికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా సాయం

- September 27, 2017 , by Maagulf
పాక్‌ చిన్నారికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా సాయం

సుష్మాస్వరాజ్‌.. యావత్‌ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే ఎన్నోసార్లు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు ప్రపంచంలో ఏ మూలన భారతీయలు ఉన్నా క్షణాల్లో ఆమె నుంచి సాయం అందుతుంది. అందుకు 'ఉజ్మా' ఘటన వంటి ఉదాహరణలు ఎన్నో.. కేవలం స్వదేశీయులే కాదు.. సాయం కోరి వచ్చిన విదేశీయులకు సైతం ఆపన్న హస్తం అందిస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన.
తమ ఏడేళ్ల చిన్నారికి భారత్‌లో ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ గత ఆగస్టులో వీసాకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ వీసా జారీ చేయకపోవడంతో ఆమె సుష్వాస్వరాజ్‌ సాయం కోరింది. తమ చిన్నారికి వీసా మంజూరు చేయాలంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు స్పందించిన సుష్మాస్వరాజ్‌.. ఆ చిన్నారి మెడికల్‌ వీసాకు అనుమతినిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సుష్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలోనూ ఆమె ఇదే విధంగా కొందరు పాక్‌ చిన్నారులు, మహిళలకు మెడికల్‌ వీసాలు అందించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com