రజనీ అల్లుడు ధనుష్ తో రాజమౌళి
- September 27, 2017
బాహుబలితో తన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు దర్శకుడు రాజమౌళి. దాంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో వుండబోతోందన్న క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం రజనీకాంత్ అల్లుడు ధనుష్తో రాజమౌళి నెక్స్ట్ మూవీ చేయనున్నాడని సమాచారం. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దానయ్య నిర్మించబోయే ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి తెరకెక్కనుందని టాక్.
దానయ్య బ్యానర్లో మూవీ వుందంటూ రాజమౌళి నుండి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఐతే ధనుష్తో జక్కన్న సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఓ విధంగా ఇది రేర్ కాంబో అనే చెప్పాలి. ఎందుకంటే ధనుష్కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. కానీ తమిళంలో మంచి మార్కెట్ వుంది.. ఇక బాలీవుడ్లో 'షమితాబ్'తో నటుడిగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ని తెలుగు, తమిళం, హిందీలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలోనే అఫిషియల్గా క్లారిటీ వస్తున్నట్లు ఫిల్మ్నగర్ టాక్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







