ఆన్లైన్ సామాజిక మాధ్యమం ట్విటర్ ఖాతాదారులకు శుభవార్త...
- September 27, 2017ఆన్లైన్ సామాజిక మాధ్యమం ట్విటర్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకూ ఎవరైనా ట్విటర్ వేదికగా తమ భావాలను పంచుకోవాలంటే ఆ భావాన్ని కేవలం 140 అక్షరాల్లోనే చెప్పాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ట్విటర్ ప్రియులకు ఆనందం 'డబుల్' కానుంది. ట్వీట్ అక్షరాల పరిమితి 280కు పెంచుతూ చేపట్టిన టెస్ట్ ప్రాజెక్టు విజయవంతగా పనిచేస్తోందని ట్విటర్ తెలిపింది. ఇది ట్విటర్కు మరింత వూతం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ట్విటర్ 2006లో ప్రారంభమైంది. ఆంగ్ల భాషను దృష్టిలో పెట్టుకుని ఒక ట్వీట్కు కేవలం 140 అక్షరాల పరిమితిని విధించింది. అయితే ఇతర భాషల వారు ట్వీట్ చేసే సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆసియా, చైనా దేశాలకు ఈ సమస్య పెద్దదిగా ఉంది. దీంతో ట్వీట్ అక్షరాల పరిమితిని పెంచేందుకు ట్విటర్ కార్యాచరణ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా పరీక్షించింది. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!