ఆన్లైన్ సామాజిక మాధ్యమం ట్విటర్ ఖాతాదారులకు శుభవార్త...
- September 27, 2017
ఆన్లైన్ సామాజిక మాధ్యమం ట్విటర్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటివరకూ ఎవరైనా ట్విటర్ వేదికగా తమ భావాలను పంచుకోవాలంటే ఆ భావాన్ని కేవలం 140 అక్షరాల్లోనే చెప్పాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ట్విటర్ ప్రియులకు ఆనందం 'డబుల్' కానుంది. ట్వీట్ అక్షరాల పరిమితి 280కు పెంచుతూ చేపట్టిన టెస్ట్ ప్రాజెక్టు విజయవంతగా పనిచేస్తోందని ట్విటర్ తెలిపింది. ఇది ట్విటర్కు మరింత వూతం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ట్విటర్ 2006లో ప్రారంభమైంది. ఆంగ్ల భాషను దృష్టిలో పెట్టుకుని ఒక ట్వీట్కు కేవలం 140 అక్షరాల పరిమితిని విధించింది. అయితే ఇతర భాషల వారు ట్వీట్ చేసే సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆసియా, చైనా దేశాలకు ఈ సమస్య పెద్దదిగా ఉంది. దీంతో ట్వీట్ అక్షరాల పరిమితిని పెంచేందుకు ట్విటర్ కార్యాచరణ ప్రారంభించి, దాన్ని విజయవంతంగా పరీక్షించింది. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







