పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మరో సర్జికల్ స్ట్రైక్
- September 27, 2017
బుధవారం తెల్లవారుఝామున ఇండియన్ ఆర్మీ మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది. అయితే ఈసారి ఇండో, మయన్మార్ బోర్డర్లో ఈ దాడులు జరిగాయి. నాగా తీవ్రవాదుల శిబిరాలపై ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఇండియన్ పారా కమాండోలు ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగా తీవ్రవాదుల శిబిరానికి భారీ నష్టం వాటిల్లినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా స్పష్టంచేసింది. గతేడాది ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ సర్జికల్ ైస్ట్రెక్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2001లో భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది నాగా ఉగ్రవాద సంస్థ. అయితే 2015, మార్చి 27న ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. నాగాలాండ్, మణిపూర్లలోని భారత జవాన్లపై దాడులు చేశారు. జూన్ 4, 2015లో మణిపూర్లోని డోగ్రా రెజిమెంట్లో ఆర్మీ కాన్వాయ్పై దాడి చేయగా 18 మంది సైనికులు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







