మరో అపూర్వ చిత్రం తెరకెక్కనుంది
- September 29, 2017
సర్జికల్స్ స్ట్రయిక్స్కు ఏడాది పూర్తయ్యింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తత, పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం.. మిలటరీ స్థావరంపై ఉగ్రమూకల దాడికి సరైన సమాధానం ఇవ్వాలని భారత్ భావించింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి.
గత ఏడాది పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీనికి మద్దతు లభించింది. ఈ దాడులు నిర్వహించి నిన్నటికి అంటే సెప్టెంబర్ 28 నాటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్పై ఢిల్లీలో రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. అంతేగాకుండా సర్జికల్ స్ట్రయిక్స్ ఎలా జరిగాయనే దృశ్యాలను కళ్లకు కట్టే విధంగా సినిమా కూడా రాబోతోంది.
సర్జికల్ స్ట్రయిక్స్పై ''ఉడీ'' పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి అధియా ధార్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. సర్జికల్ స్ట్రయిక్స్ టీమ్కి నాయకత్వం వహించిన కమాండర్గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









