రొహింగ్యా ముస్లింలపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

- September 29, 2017 , by Maagulf
రొహింగ్యా ముస్లింలపై యూపీ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

మయన్మార్ నుంచి మన దేశానికి వచ్చిన రొహింగ్యా ముస్లింలు శరణార్థులు కాదని, చొరబాటుదారులని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వారి దుస్థితిపై కొందరు సానుభూతి, ఆందోళన వ్యక్తం చేయడాన్ని ఖండించారు. భారత ప్రభుత్వం రొహింగ్యాలపై వైఖరిని స్పష్టం చేసిందన్నారు. మయన్మార్‌లో అనేక మంది అమాయక హిందువులను ఊచకోత కోశారన్నారు. రొహింగ్యా ముస్లింలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
రొహింగ్యా ముస్లింలను భారతదేశం నుంచి పంపించేయడంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com