ఉద్యోగాలు వద్దా? అయితే ప్యాకెజీలు ఇస్తామంటున్న కేసిఆర్
- September 29, 2017
సింగరేణి కార్మికుల సమస్యలు అర్థం చేసుకోవడంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తే దానిపై కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. వారసత్వ ఉద్యోగాలపై కోర్టు స్టే ఇస్తే జాతీయ సంఘాలు స్వీట్లు పంచుకున్నాయని గుర్తు చేశారు. వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని టీబీజీకేఎస్ ప్రతిపాదనకు ప్రభుత్వం మద్దతిస్తుందని చెప్పిన కేసీఆర్ .. ఉద్యోగాలు అవసరం లేదనుకున్న వారికి రూ. 25 లక్షల ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. చిల్లర రాజకీయాలు చేసే అవసరం తనకు లేదని, కార్మికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఆటో మిషన్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి నెల సింగరేణిపై 2 గంటల రివ్యూ చేస్తామని, 2 నెలల్లో బోగస్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. సింగరేణిలో 1980 తర్వాత కొత్త ఉద్యోగాలు లేవని తమ ప్రభుత్వం వచ్చాకే మళ్లీ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







