దుబాయ్ లో ఘనంగా 'దసరా' సంబరాలు
- September 30, 2017
దుబాయ్: భారత సంస్కృతిలో పండుగలు ఒక ప్రత్యేక పాత్ర ను పోషిస్తాయి. పండుగ వస్తోందంటే ఊరూరా సందడి నెలకొంటుంది. నవరాత్రుల శోభా, ఆడవారి దాండియా తో దసరా ఎంతో కన్నులపండువగా జరుగుతుంది. భారత దేశంలో ఇంత ఘనంగా జరగటం పెద్ద విషయమేమీ కాదు కానీ ఇంతే సందడితో, కోలాహలంతో ముస్లిం దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల్లో జరిగితే విశేషమే మరి. దుబాయ్ లో లహెజ్ & సుల్తాన్(జెబెల్ అలీ)లో గల వర్కర్స్ క్యాంపు లో గత పన్నెండు సంవత్సరాలుగా పదివేల మంది కలిసి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక్క దసరా నే కాకుండా వినాయక చవితి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడి భారతీయులు జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో హిందూ సోదరులకు అండగా ముస్లిం సోదరులు కూడా తమ వంతు సాయం అందిస్తూ ఉండటం గమనార్హం. అన్నదానం కార్యక్రమం లో 10,000 మంది కి పైగా పాల్గొంటారు.
ఈ కార్యక్రమాన్ని బెత్ రెడ్డి వెంకట్ రెడ్డి,సూర్య నారాయణ్ రెడ్డి మాడపాటి, కొండా బాబు బొర్రా,రామ కృష్ణ,
బాపి రాజు,వీరెడ్డి వెలగల ,కర్రీ హరినాధ్ రెడ్డి మాడపాటి నరేంద్ర రెడ్డి,గణపతి రెడ్డి ,సతీష్ రెడ్డి,సుధాకర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు.





తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







