ఎమిరేట్స్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ...ముగ్గురికి గాయాలు
- October 02, 2017
ఉమ్ అల్ ఖ్వాన్ : ఆదివారం ఉదయం ఉమి అల్ క్వెయిన్లోని ఎతిహాడ్ రోడ్డుపై రెండు వాహనాల మధ్య జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక ఎమిరాటీ వ్యక్తి చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వాహనాలలో ఇరుక్కున్న డ్రైవర్ ను విడిపించేందుకు హైడ్రాలిక్ కట్టర్లు మరియు ఇతర సామగ్రిని ఉపయోగించాల్సి వచ్చింది. ఈ రెండు వాహనాలలో నల్గురు వ్యక్తులు ఇరుక్కున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో వాహనాల ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఉమ్ అల్ క్వాన్న్ ఎమిరేట్ లో సివిల్ డిఫెన్స్ విభాగంలో కేంద్రాల్లోని విభాగాల అధిపతి మేజర్ అబ్దుల్లా అల్ ఫలాహి, మాట్లాడుతూ .. సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ అప్రమత్తం చేసిన వెంటనే ట్రాఫిక్ పోలీస్, అంబులెన్సన్స్, పారామెడిక్స్, రెస్క్యూ జట్ల బృందం ఈ ప్రాంతానికి తరలించారు. పారామెడిక్స్ జట్లు గాయపడిన నలుగురికి ప్రాధమిక చికిత్స అందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







