సరుకుల ఓడలో ఊపిరాడక ముగ్గురు మృతి

- October 02, 2017 , by Maagulf
సరుకుల ఓడలో ఊపిరాడక ముగ్గురు మృతి

మస్కట్ : సోహార్ నౌకాశ్రయంలో లంగరు వేయబడిన సరుకుల నౌకలో ఊపిరాడక  ముగ్గురు ఆసియా దేశస్థులు మరణించారు, పౌర అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) అధికారులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం సరుకుల నౌకలో ఒక నిల్వ ఉంచే గదిలో వారు పడిపోయి వారు అక్కడ  చిక్కుకున్నారు, సోహార్  పౌర అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ట్వీట్ చేసింది.." ఈ ప్రమాదంలో ఓడలో చెక్క కలపను సంరక్షించే  రసాయనాలను పీల్చుకున్న ఫలితంగా ముగ్గురు ఆసియా దేశస్థులు మరణించారని తెలిపారు. సోహర్ ఇండస్ట్రియల్ పోర్ట్ కంపెనీ (ఎస్ఐపిసి) ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: "శనివారం రాత్రి  9.30 గంటలకు పోర్ట్ లో సాధారణ సరుకుల నౌకలో ప్రమాదానికి గురైన కారణంగా ముగ్గురు కార్మికుల దురదృష్టకరమైన పరిస్థితిలో ఊపిరాడక చనిపోయారని  ప్రకటించటానికి ఎంతో విచారిస్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com