పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి కొమరంభీమ్ జాతీయ పురస్కారం
- October 05, 2017
నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తికి కొమరం భీమ్ జాతీయ పురస్కారం వరించింది. నేడు(శుక్రవారం) కొమరం భీమ్ వర్థంతిని పురస్కరించుకుని ఈఏడాదికిగానూ ఈ జాతీయ అవార్డుకు పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తిని ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ చైర్మెన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి ప్రకటించారు. తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్షన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది ఈ ప్రతిష్టాత్మక 'కొమరం భీమ్' జాతీయ పురస్కారాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా కె.వి.రమణాచారి మాట్లాడుతూ, ''జల్ జంగిల్ జమీన్' నినాదంతో గోండు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం సాయుధ పోరాటం చేసిన అమరయోధుడు కొమరం భీమ్ ఆశయ సాధనలో, ఆయన స్ఫూర్తితో ఆర్.నారాయణమూర్తి పలు చిత్రాలను నిర్మించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. 'అర్థరాత్రి స్వతంత్య్రం', 'అడివి దివిటీలు', 'లాల్ సలాం', 'ఎర్రసైన్యం', 'చీమలదండు', 'చీకటి సూర్యులు', 'ఊరు మనదిరా', 'వేగుచుక్కలు', 'అరణ్యం', 'ఎర్రోడు', 'సింగన్న' వంటి పలు విజయవంతమైన చిత్రాలు కొమరం భీమ్ ఆశయాలకు అనుగునంగా రూపొందించినవే. అందుకే ఈ ఏడాదికిగానూ అవార్డును ఆర్.నారాయణమూర్తికివ్వడం సమంజసమని నమ్ముతున్నాం' అని అన్నారు. 'గతంలో ఈ అవార్డును 'కొమరం భీమ్' చిత్ర దర్శకుడు, నిర్మాత అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది.
ఈ అవార్డు కింద 51వేల రూపాయల నగదు, జ్ఞాపిక పత్రంతో సత్కరించనున్నాం' అని కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









