రాజుగారి గది -2

- November 02, 2015 , by Maagulf
రాజుగారి గది -2

రాజుగారి గది -2 చిత్రానికి కథ రెడీగా ఉందని చిత్ర దర్శకుడు ఓంకార్ తెలిపారు. సోమవారం రాజుగారి గది చిత్రం హీరో అశ్విన్ బాబు, రచయిత దివాకర్, సహనటులు చేతన్, బుజ్జెమ్మతో కలసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఓంకార్ మీడియాతో మాట్లాడారు. దసరా పర్వదినం రోజున విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందన్నారు. అందులోభాగంగా విజయయాత్ర కొనసాగిస్తున్నామన్నారు. శ్రీవారి ఆశీస్సులతోనే ఇక్కడి నుంచే ఆ చిత్రానికి డైలాగులు రాశామని.. చిత్రం విజయం సాధించినందుకు మొక్కు తీర్చుకున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com