అక్టోబరు 31వ తేదీ నుంచి అమెరికాకు పాక్ విమాన సర్వీసులు రద్దు
- October 10, 2017
ఈ అక్టోబరు 31వ తేదీ నుంచి అమెరికాకు విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. భారీ నష్టాలే దీనికి కారణమని చెప్పింది. అమెరికాకు విమాన సర్వీసులను నడపడం వల్ల తమ సంస్థకు ఏటా రూ. 125 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. నష్టాలు భరించలేనంతగా తయారయ్యాయని. మరో దారి లేకే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. 1961లో అమెరికాకు సర్వీసులను స్రారంభించిన ఈ సంస్థ ,ప్రస్తుతానికి న్యూయార్క్ తో పాటు మరో మూడు అమెరికా నగరాలకు సర్వీసులను నడుపుతోంది. గతంలోనే అమెరికాకు సర్వీసులను నిలిపివేయాలని ఈ సంస్థ పలుమార్లు ప్రయత్నించి, రాజకీయ ఒత్తిడి వల్ల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







