వీసా దరఖాస్తు, రెన్యువల్: మున్సిపల్ సెంటర్ వద్దనే
- October 11, 2017
వీసా, రెసిడెన్సీ ట్రాన్సాక్షన్స్, మున్సిపల్ సర్వీసెస్ అన్నీ ఒకే చోట లభించేలా వన్ స్టాప్ సెంటర్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, రెండో అమెర్ సెంటర్ని ప్రారంభించారు. దుబాయ్ మునిసిపాలిటీ అల్ కిఫాఫ్ సెంటర్ వద్ద ఈ సెంటర్ ఏర్పాటయ్యింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) నిర్వహణలో ఈ సెంటర్స్ పనిచేస్తాయి. మే నెలలో ముహైసినా ప్రాంతంలో 30 ఎమెర్ బిజినెస్ సెంటర్స్ ప్రారంభమయ్యాయి. క్రమంగా వీటి సంఖ్య ఎమిరేట్ వ్యాప్తంగా 600కి చేరుకుంటోంది. జిడిఆర్ఎఫ్ఎ దుబాయ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మెర్రి మాట్లాడుతూ, దుబాయ్ మునిసిపాలిటీలో ఎమెర్ సెంటర్ ప్రారంభించడం ద్వారా సంబంధిత సేవలు మరింత సులువుగా, ఒకే చోట లభించడానికి వీలవుతుందని తెలిపారు. మునిసిపల్ సర్వీసులు, అకామడేషన్ సర్వీసులు, రెసిడెన్సీ పర్మిట్స్, రెసిడెన్సీ రెన్యువల్స్, రెసిడెన్స్ క్యాన్సిలేషన్, న్యూ పాస్పోర్ట్ - చేంజ్ ఆఫ్ రెసిడెన్స్, షార్ట్ మరియు లాంగ్ విజిట్ వీసా సర్వీసులు ఎమెర్ ద్వారా పొందడానికి వీలుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







