4 నెలలపాటు షార్జా రింగ్రోడ్ పాక్షికంగా మూసివేత
- October 11, 2017
ఇండస్ట్రియల్ ఏరియా 17 వద్ద షార్జా రింగ్ రోడ్ని వినియోగించే మోటరిస్టులు, ఈ ప్రాంతంలో ముందు ముందు ఏర్పడే ట్రాఫిక్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్టీరియల్ రోడ్డు నాలుగు నెలలపాటు పాక్షికంగా మూసివేయనుండడమే దీనికి కారణం. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ రోడ్డుని పాక్షికంగా నాలుగు నెలలపాటు మూసివేయడానికి నిర్ణయించుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మినిస్ట్రీకి చెందిన రోడ్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రోడ్డు మూసివేయబడ్తుందని చెప్పారు. రోడ్డు మూసివేత కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలనీ, హెచ్చరిక బోర్డులను పరిగణనలోకి తీసుకుని వాహనాలను నడపాలని సూచించారు. మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకుగాను, ప్రాజెక్ట్ విస్తరణ పనుల కోసం ఈ మూసివేతను అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







