పోలీస్ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడి, 61 మంది మృతి
- October 17, 2017
అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పక్తియా ప్రావిన్స్ లోని గార్డెజ్ ప్రాంతంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని పోలీస్ శిక్షణ కేంద్రంపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.
ఈ దాడిలో 61మంది మృతిచెందగా, మరో 160 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పోలీసులతో పాటు మహిళలు, విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని.. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని, మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
మంగళవారం ఉదయం భద్రతావలయాన్ని దాటుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ శిక్షణ కేంద్రంలోకి చొరబడ్డారు. రెండు కార్లతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం మరికొందరు ముష్కరులు పోలీసులపైకి కాల్పులు జరిపారు. మరోవైపు ఘటనకు పాల్పడింది తామేనంటూ తాలిబన్ ఉగ్రవాద సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







