యు. ఏ . ఈ. లో నేటినుండి బహిరంగ వై-ఫై : ఎతిసలత్ వినియోగదారులకు ఉచితం
- November 04, 2015
దేశవ్యప్తంగా, అబుధాబి, దుబాయ్ మరియు ఉత్తరాది రాష్ట్రాలలో 250 బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు " యు. ఏ . ఈ. వై-ఫై బై ఎతిసలత్" పధకం కింద తమ మొబైల్ ఫోన్ ల ద్వారా అత్యధిక వేగం గల నిరాటంకంగా, భద్రమైన, నాణ్యతకు మారుపేరుగా నిలిచే ఇంటర్నెట్ సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. 1 జి. బి. లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ డేటాకు చందాదారులైన ఎతిసలత్ వినియోగదారులు ఈ వై-ఫై సేవలను ఉచితంగా పొందవచ్చు. ఎతిసలత్ చీఫ్ కన్సుమర్ ఆఫీసర్ ఖలీద్ ఎల్ ఖౌటీ మాట్లాడుతూ, " యు. ఏ . ఈ. ప్రాంతం వాణిజ్య పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశనేతల దూరదృష్టి గల ప్రణాళిక ప్రకారం ఎతిసలత్, స్థానిక ప్రజలకు, వ్యాపార వర్గానికి కూడా కనెక్టివిటీ నిరంతరం అందుబాటులో ఉండేలా అద్భుతమైన టెలికం మౌలిక సదుపాయాలను కల్పించింది” అని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







