డ్రంకన్ డ్రైవింగ్ నిషాచరులు న్యాయస్థానానికి చెల్లించిన జరిమానా అక్షరాలా రూ.8,29,26,660
- November 04, 2015
వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ అత్యంత ప్రమాదకరంగా పరిణమించే మద్యం తాగి వాహనం నడపటం (డ్రంకన్ డ్రైవింగ్)పై ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించి బుధవారానికి నాలుగేళ్లు పూర్తయింది. ఈ తనిఖీల్లో చిక్కిన మందుబాబులకు న్యాయస్థానం జరిమానాలు విధించడంతో పాటు జైలు శిక్షలు విధిస్తోంది. ఇప్పటి వరకు 'నిషా'చరులు న్యాయస్థానానికి చెల్లించిన జరిమానా అక్షరాలా రూ.8,29,26,660. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములకు మంచి ఆల్కాహాల్ ఉంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీన్ని బ్లెడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) అంటారు. ఇందుకుగాను ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన నిధులతో ఉపకరణాలు సమీకరించుకుని 2011 నవంబర్ 4 నుంచి వారంలో నాలుగు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి గత నెలాఖరు వరకు మొత్తం 54,658 మంది ట్రాఫిక్ పోలీసులకు చిక్కగా, వారిలో 5677 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయి.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









