మండుతున్న బంగారం

- October 18, 2017 , by Maagulf
మండుతున్న బంగారం

న్యూఢిల్లీ: బంగారం ధర మరోసారి భగ్గుమంది. ధన త్రయోదశి, దీపావళి పండగ సందర్భం 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.290 పెరిగి మూడు వారాల గరిష్ఠానికి చేరింది. దీపావళి సందర్భంగా స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి బంగారానికి డిమాండ్‌ పెరగడంతో 10గ్రాములు రూ.31వేల చేరిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర స్థిరంగా ఉంది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి రూ.41,000గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి ధర 0.12శాతం తగ్గి ఔన్సు 1,283.20 డాలర్లుగా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com